అక్కడ కుంబ మేళ ... ఇక్కడ కొబ్బరి కాయలు గిరాకీ ... ఇంతకు ఏమయింది ?
- Get link
- X
- Other Apps
అక్కడ కుంబ మేళ ... ఇక్కడ కొబ్బరి కాయలు గిరాకీ ... ఇంతకు ఏమయింది ?అక్కడ కుంబ మేళ ... ఇక్కడ కొబ్బరి కాయలు గిరాకీ ... ఇంతకు ఏమయింది ?
కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించి, నదికి కురిడి కొబ్బరి సమర్పించడం సాంప్రదాయం. దీనితో కుంభమేళాకి కోనసీమ నుంచి కురిడి కొబ్బరి ఎగుమతులు భారీగా పెరిగాయి. దాదాపు రెండు లక్షలు కురిడి కొబ్బరికాయలు ఈ ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. ధర కూడా గతంలో ఎప్పుడు లేనివిధంగా భారీగా పెరిగింది. ఒక్కొక్క కురిడి కొబ్బరికాయ 20 నుంచి 25 రూపాయల వరకు పలుకుతుంది. కొబ్బరి రైతుల చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు .కోనసీమ పరిసర ప్రాంతాల నుంచి 100 కొబ్బరికాయలు బయటకు వెళ్తుంటే అందులో వాటర్ కోకోనట్స్ 20 మాత్రమే ఉంటున్నాయి. మిగతా 80 కూడా కురిడి కొబ్బరి ఉంటున్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా కొబ్బరి దిగుబడి ఈ ఏడాది తగ్గడం కోనసీమ రైతులకు కలిసొచ్చింది. దానివలన అనూహ్యమైన ధర పలుకుతుంది. కురిడీలో గండేర రకానికి డిమాండ్ మరింత ఎక్కువ ఉందని రైతులు చెప్తున్నారు. కురిడీకి వచ్చిన అనూహ్యమైన ధరతో రైతులు, వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్లు, కూలీలకు చేతినిండా పని దొరుకుతుంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఈసారి కొబ్బరి రైతులకు అధిక లాభాలు వస్తాయి. కురిడీకి ఉన్న డిమాండ్ తో ధరలు మరింత పెరుగుతాయని రైతులు అనుకుంటున్నారు. గతంలో కురిడిని ఆయుర్వేదం మందులు తయారీకి, వంటలలో మాత్రమే వినియోగించేవారు. దాంతో ఇప్పటివరకు కురిడీని అంతంత మాత్రంగానే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. మొత్తానికి మహా కుంభమేళా కోనసీమ కొబ్బరికి కలిసొచ్చింది. కురిడీ కొబ్బరి ధరలు అంతంకంతకు పెరగడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment